తెలంగాణలో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు.ఈ మేరకు ఈనెల 16వ తేదీన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటన ఉంటుందని తెలిపారు.
వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభా వేదికగా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను ప్రకటించనున్నారని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.మ్యానిఫెస్టో సిద్ధం అవుతుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూశాక రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అవుతుందని తెలిపారు.కొత్త మ్యానిఫెస్టో కోసం ప్రజలంతా ఆ శుభవార్త కోసం ఎదురుచూడాలని చెప్పారు.
ఎవరెన్నీ ట్రిక్కులు చేసినా తెలంగాణలో కేసీఆరే హ్యాట్రిక్ కొడతారని స్పష్టం చేశారు.







