నడిరోడ్డుపై ప్రమాదకర గుంత...!

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం వాయిలసింగారం-కోదాడ ప్రధాన రహదారిలో రామిరెడ్డిపాలెం మిల్లు వద్ద కల్వర్టు దెబ్బతిని నడిరోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది.శిధిలావస్థకు చేరుకున్న తర్వాత నూతన బీటి రోడ్డు నిర్మాణం కోసం 6 నెలల క్రితం పాత రోడ్లు తవ్విన కాంట్రాక్టర్ కల్వర్టుకు ఎలాంటి పనులు చేయకుండా తూతూ మంత్రంగా కంకర,డస్ట్ పరచి వదిలేశారు.

 A Dangerous Pothole On The Road, Dangerous Pothole , Road, Suryapet, Anantagiri-TeluguStop.com

దీనిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఈ రోడ్డు వైపు రావడమే లేదు.

ఈ రహదారి మీదగా వాయిలసింగారం, వసంతపురం,త్రిపురావరం,రత్నావరం,మీట్య తండా, కొత్త గోల్ తండా,పాత గోల్ తండా వెంకట్రాంపురం తడుతర గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు.

వాహనాల తాకిడికి,వర్షాలకు పోసిన డస్ట్ కొట్టుకుపోయి,కంకర పైకి తేలడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.దీనికి తోడు నడి ఏ రోడ్డుపై భారీ గుంత ఉండడంతో రాత్రిపూట ప్రయాణం చేయాలంటే వణికిపోతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లనే బిటి రోడ్డు నిర్మాణం ఆలస్యం అవుతుందని వాహనదారులు ఆరోపిస్తున్నారు.తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నూతన కల్వర్టు నిర్మించి,బిటి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని, వాహనదారులు,ప్రజలు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube