వరుస సినిమాలతో మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న శర్వానంద్ ( Sharwanand ) ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నారు.ఈయన ఎప్పటినుండో రక్షిత రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించినట్టు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వినిపించాయి.

ఇక వీరి పెళ్లి, రిసెప్షన్ చాలా గ్రాండ్ గా జరిగాయి.ఇక పెళ్లి విషయం పక్కన పెడితే ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య ( Sritam Aadithya ) దర్శకత్వంలో తన 35వ సినిమాలో నటిస్తున్నారు.కట్ చేస్తే.శర్వానంద్ గురించి సోషల్ మీడియాలో కొన్ని ఎఫైర్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే సెలబ్రిటీల విషయంలో ఇది కామన్ అయినప్పటికీ పెళ్లయిన సింగర్ తో శర్వానంద్ ఎఫైర్ అంటూ వస్తున్న వార్తలు శర్వానంద్ అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి.ఇక అసలు విషయం ఏమిటంటే.
హీరో శర్వానంద్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ స్టార్ హీరోలకి, హీరోయిన్లకి తమ్ముడు క్యారెక్టర్లు చేస్తూ ఉండేవారు.అలా చేస్తున్న సమయంలో గమ్యం సినిమా( Gamyam Movie ) తో ఈయనకి హీరోగా మంచి స్టార్డం వచ్చింది.
ఇక ఆ స్టార్డం ని కంటిన్యూ చేస్తూ ఇప్పటివరకు సోలో హీరోగా చేస్తూ వస్తున్నారు.

అయితే అలాంటి శర్వానంద్ ఓ ఈవెంట్లో ఓ సీనియర్ సింగర్ తో ఏర్పడిన పరిచయంతో పెళ్లి వరకు వెళ్లాలనుకున్నారట.ఇక ఆ సింగర్ ఎవరో కాదు స్మిత.స్మిత ( Smitha ) కేవలం గాయకురాలిగానే కాకుండా బిజినెస్ మాన్ గా అలాగే కొన్ని సినిమాల్లో నటిగా కూడా రాణిస్తుంది.
అయితే అప్పట్లో స్మిత శర్వానంద్ మధ్య ఏదో నడుస్తోంది అంటూ గాసిప్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి.ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వినిపించాయి.
ఇక స్మిత శర్వానంద్ ( Sharwanand ) మీద పిచ్చి ప్రేమతో భర్తకు విడాకులు ఇచ్చి శర్వానంద్ ని రెండో పెళ్లి చేసుకోబోతుందని ఇలా ఎన్నో వార్తలు వినిపించేసరికి అందులో ఎలాంటి నిజం లేదు అని వీరిద్దరూ పరోక్షంగా కొట్టి పారేశారు.







