ఏపీ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు.ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం మహిళలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాజకీయ రిజర్వేషన్ వంటి అంశాలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు.నాలుగున్నరేళ్లుగా ప్రతి ఆడబిడ్డ కష్టాలను సీఎం జగన్ తీర్చుతున్నారని తెలిపారు.
అందుకే రాష్ట్రంలో మహిళలు అందరూ జయహో జగన్ అంటున్నారని పేర్కొన్నారు.చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువని విమర్శించిన మంత్రి రోజా చంద్రబాబు చీటర్, జగన్ లీడర్ అని వెల్లడించారు.







