నూతన భవనంలో కొలువుదీరిన పార్లమెంట్ సభ్యులు

ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనంలో ఎంపీలు కొలువుదీరారు.ఈ నేపథ్యంలో లోక్ సభ సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు.

 Members Of Parliament Weighed In The New Building-TeluguStop.com

నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలకు సభ్యులు అందరూ సహకరిస్తారని భావిస్తున్నట్లు ఓం బిర్లా పేర్కొన్నారు.గణేశ్ చతుర్థి రోజున కొత్త పార్లమెంట్ భవనంలోకి రావడం శుభసూచకమని తెలిపారు.

అనంతరం నూతన పార్లమెంట్ భవనంలోకి ఎంపీలకు ప్రధానమంత్రి మోదీ స్వాగతం పలికారు.అమృతకాలంలో కొత్త సంకల్పాలతో కొత్త లక్ష్యాల కోసం ముందుకెళ్తున్నామన్నారు.

ఈ క్రమంలోనే మరి కాసేపటిలో లోక్ సభ ఎదుటకు మహిళా రిజర్వేషన్ బిల్లురానుంది.ఈ మేరకు బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ ప్రవేశపెట్టనున్నారు.

అయితే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో రేపు చర్చ జరగనుంది.

మరోవైపు మధ్యాహ్నం 2.15 గంటలకు రాజ్యసభ ప్రారంభం కానుంది.ఈనెల 21న రాజ్యసభలో కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube