కౌలు రైతులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.రాష్ట్రంలో కౌలు రైతులకు ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదని తెలిపారు.
కౌలు రైతులే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
కౌలు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.
కేసీఆర్ అనాలోచిత విధానాలతో రైతులు నష్టపోయారని మండిపడ్డారు.ఈ క్రమంలో భరోసా కల్పించేందుకే కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించామని వెల్లడించారు.
తెలంగాణలో రైతు రాజ్యస్థాపనే కాంగ్రెస్ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.







