కుటుంబం కన్నా చంద్రబాబుకు ప్రజలే ముఖ్యం..: భువనేశ్వరి

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ముగిసింది.ఈ క్రమంలో చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి కలిశారు.

 People Are More Important To Chandrababu Than Family..: Bhuvaneshwari-TeluguStop.com

అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని తెలిపారు.చంద్రబాబు నిర్మించిన భవనంలోనే ఆయనను కట్టి పడేశారని వాపోయారు.

ఏమీ లేని కేసులో చంద్రబాబును జైలులో పెట్టారన్న భువనేశ్వరి ఇది తమ కుటుంబానికి కష్టకాలమని తెలిపారు.ప్రజల సంక్షేమం కోసం, వారి స్వేచ్ఛ కోసం పోరాడిన వ్యక్తి అని చెప్పారు.

ఫ్యామిలీ కంటే ఆయనకు ప్రజలే ముఖ్యమని చెప్పేవారని ఆమె వెల్లడించారు.ఈ క్రమంలో చంద్రబాబు కోసం ప్రజలంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ప్రజల కోసం ఎల్లప్పుడూ నిలుస్తుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube