రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ముగిసింది.ఈ క్రమంలో చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి కలిశారు.
అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని తెలిపారు.చంద్రబాబు నిర్మించిన భవనంలోనే ఆయనను కట్టి పడేశారని వాపోయారు.
ఏమీ లేని కేసులో చంద్రబాబును జైలులో పెట్టారన్న భువనేశ్వరి ఇది తమ కుటుంబానికి కష్టకాలమని తెలిపారు.ప్రజల సంక్షేమం కోసం, వారి స్వేచ్ఛ కోసం పోరాడిన వ్యక్తి అని చెప్పారు.
ఫ్యామిలీ కంటే ఆయనకు ప్రజలే ముఖ్యమని చెప్పేవారని ఆమె వెల్లడించారు.ఈ క్రమంలో చంద్రబాబు కోసం ప్రజలంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ప్రజల కోసం ఎల్లప్పుడూ నిలుస్తుందని వెల్లడించారు.