రాజకీయం అంటేనే ఒక రణరంగం.ఈ రణరంగంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అస్సలు గ్రహించలేం.
ఇందులోకి దిగాము అంటే ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి.అలాంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్( AP ) రాష్ట్రంలో చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టిడిపి( TDP ), వైఎస్ఆర్సిపి( YCP ) పార్టీలు మాత్రమే హోరాహోరీ తలపడుతూ ఉంటాయి.తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత మొదటిసారి చంద్రబాబు సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయ్యారు.
రెండోసారి జగన్మోహన్ రెడ్డి అయ్యారు.ఇలా చంద్రబాబు( Chandrababu Naidu ) సీఎంగా ఉన్నప్పుడు అక్రమాస్తుల కేసులో జగన్(JAGAN) అరెస్ట్ అయ్యాడు.
ఇప్పుడు జగన్ సీఎం గా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చంద్రబాబు రెస్ట్ అయ్యాడు.ఇలా దెబ్బకు దెబ్బ తీసుకున్నారు.
ఇదే తరుణంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకు తరలించడంతో టీడీపీ శ్రేణులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.అంతేకాకుండా సోమవారం బంద్ కూడా ప్రకటించారు.
ఇదే తరుణంలో వైసిపి శ్రేణుల అక్రమాలు ఎప్పటికైనా బయటపడతాయి.
అక్రమార్కులు జైలు పాలు కావాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదంతా అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధం.కట్ చేస్తే.
తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో సీనియర్ ఎన్టీఆర్( SR NTR ) అభిమానులు కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు.చంద్రబాబు అరెస్ట్ అవ్వడం ఎన్టీఆర్ ఆత్మకు శాంతినిస్తుందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఇదే తరుణంలో విజయవాడలో సీనియర్ ఎన్టీఆర్ పేరుతో కొన్ని ఫ్లెక్సీలు కూడా వెలిశాయి.ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.
ఈ ఫ్లెక్సీలో జగన్ ఫోటోలతో పాటుగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను( UDAYA BHANU ), సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్( JR NTR ), నందమూరి హరికృష్ణ( HARI KRISHNA ) ఫోటోలు కూడా ఉన్నాయి.ఇదే తరుణంలో చాలామంది నందమూరి అభిమానులు టిడిపికి అసలైన నాయకుడు జూనియర్ ఎన్టీఆర్( JR NTR ) వస్తేనే బాగుంటుందని కామెంట్స్ పెడుతున్నారు.చంద్రబాబు పని అయిపోయిందని, జూనియర్ ఎన్టీఆర్ టిడిపిని కాపాడాలని, ఆయన రంగంలోకి దిగితేనే టిడిపి గట్టెక్కుతుందని తెలియజేస్తున్నారు.మరి చూడాలి ఎన్టీఆర్ దీనిపై ఏ విధంగా స్పందిస్తారో అనేది ముందు ముందు తెలుస్తుంది.