అల్లు అర్జున్ డీజే సినిమా( Duvvada Jagannadham ) తో టాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే.నాలుగు అయిదు సంవత్సరాల పాటు పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది.
అయితే ఒకేసారి ఆమె ఇండస్ట్రీ లో కనిపించకుండా పోయింది.టాలీవుడ్ లో ఈమెకు ఆఫర్లు కరువయ్యాయి.
తెలుగు లో సినిమా ఆఫర్లు రాకున్నా కూడా బాలీవుడ్ లో సినిమా లు చేస్తూ బిజీగా నిలిచింది.
అక్కడ ఏడాది లోనే చాలా సినిమా లు చేసింది.కానీ ఏ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు.దాంతో ఈ అమ్మడి యొక్క క్రేజ్ పై అనుమానాలు మొదలు అయ్యాయి.
ఇదే సమయంలో ఫేడ్ ఔట్ అయింది అనుకుంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) మెల్లగా రీ ఎంట్రీ కి సిద్ధం అయింది.పూజా హెగ్డే సైడ్ అవ్వడం తో రకుల్ ప్రీత్ సింగ్ కి మంచి ఆఫర్లు వస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే తెలుగు లో రెండు సినిమా లకు ఈ అమ్మడు ఓకే చెప్పింది.ఆ సినిమా లకు సంబంధించిన చర్చలు దాదాపుగా పూర్తి అయ్యాయి.
మరో రెండు వారాల్లో ఆ సినిమా ల యొక్క అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది.ఇక తెలుగు మరియు హిందీ భాష ల్లో పూజా హెగ్డే ( Pooja hegde )కెరీర్ దాదాపుగా ఖతం అయిందని అంటున్నారు.ఇలాంటి సమయంలో ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కాస్త జాగ్రత్త గా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే కచ్చితంగా స్టార్ హీరోయిన్ గా మళ్లీ రెండు మూడు సంవత్సరాల పాటు కెరీర్ ను కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రకుల్ కి సోషల్ మీడియా లో ఉన్న గుర్తింపు మరియు ఫాలోయింగ్ కారణంగా మళ్లీ బిజీ అయ్యి స్టార్ హీరోల దృష్టిని ఆకర్షిస్తుందేమో చూడాలి.