మూల మలుపులో పొంచి ఉన్న ప్రమాదం...!

నల్లగొండ జిల్లా: నిడమనూర్ మండలం( Nidamanur ) ముకుందాపురం నుండి తుమ్మడం వైపు వెళ్లే ప్రధాన రహదారిపైకోటమైసమ్మ గుడి సమీపంలోని మూల మలుపు దగ్గర గత కొన్ని నెలల క్రితం ముదిమానిక్యం మేజర్ అర్-15 కెనాల్ మరమ్మత్తుల కొరకు పెద్ద గుంత తవ్వి పూడ్చకుండా వదిలేయడంతో వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Danger Lurks Around The Corner Kota Mysamma Temple , Nalgonda District , Nidaman-TeluguStop.com

ఈ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని,సమీపంలోనే కోట మైసమ్మ అమ్మవారి( Kota Mysamma Temple ) టెంపుల్ ఉండడంతో మొక్కలు తీర్చుకునేందుకు నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వచ్చిపోతూ ఉంటారని,మూల మలుపులో పెద్ద గుంత ఉండడంతో చూసుకోక ప్రమాదాలకు గురయ్యే( Devotees ) అవకాశం ఉందని వాపోతున్నారు.

ప్రమాదకరంగా మారిన ఈగుంతతో ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు చర్యలు చేపట్టక పోవడంవారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబధిత అధికారులు స్పందించి పనులు త్వరిగతిన పూర్తి చేసి, ప్రజలను ప్రమాదాల బారినుండి కాపాడాలి కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube