భారతీయ రైల్వే శాఖ( Indian Railways ) తరచుగా ఎక్కువ దూరం ప్రయాణించే ప్యాసింజర్ల కోసం సర్క్యులర్ జర్నీ టికెట్( Circular Journey Ticket ) (CJT) అనే ప్రత్యేక రకం టిక్కెట్ను అందుబాటులోకి తెస్తుంటుంది.సర్క్యులర్ జర్నీ టికెట్లు సాధారణ టిక్కెట్ల కంటే చౌకగా ఉంటాయి.
ఒకే టిక్కెట్పై పలు గమ్యస్థానాలకు ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయి.ఈ టికెట్లతో ప్రయాణికులు గరిష్ఠంగా 8 బ్రేక్ స్టేషన్లలో దిగి, తర్వాత తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.
సర్క్యులర్ జర్నీ టికెట్ గరిష్ఠ వ్యాలిడిటీ 56 రోజులు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆ టికెట్తో ఎప్పుడంటే అప్పుడు ట్రైన్ ఎక్కచ్చు.

సర్క్యులర్ జర్నీ టికెట్ బుక్ చేసుకోవడానికి, మీ ప్రాంతానికి సంబంధించిన రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ని( Railway Division Commercial Manager ) సంప్రదించాలి.వారు మీ ప్రయాణ ప్రణాళిక ఆధారంగా టిక్కెట్ ధరను లెక్కించి, టికెట్ జారీ చేస్తారు.మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించే స్టేషన్ బుకింగ్ కార్యాలయంలో కూడా మీరు సర్క్యులర్ జర్నీ టికెట్ కొనుగోలు చేయవచ్చు.
సర్క్యులర్ జర్నీ టికెట్ కోసం ఛార్జీ మొత్తం ప్రయాణించిన దూరం, బ్రేక్ స్టేషన్ల సంఖ్య, ప్రయాణ తరగతి ఆధారంగా లెక్కిస్తారు.సీనియర్ సిటిజన్లు కనీసం 1,000 కి.మీ దూరం ప్రయాణించినట్లయితే సర్క్యులర్ జర్నీ టికెట్లపై తగ్గింపు కూడా పొందొచ్చు.సుదీర్ఘ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తుంటే రైలు ప్రయాణంలో డబ్బు ఆదా చేయడానికి సర్క్యులర్ జర్నీ టికెట్లు గొప్ప మార్గం.
ఎక్కువ టిక్కెట్లను కొనుగోలు చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేనందున అవి కూడా సౌకర్యవంతంగా ఉంటాయి.

అదే స్టేషన్లో ప్రారంభమయ్యే, ముగిసే ప్రయాణానికే మాత్రమే సర్క్యులర్ జర్నీ టికెట్లని మాత్రమే బుక్ చేయగలరని గమనించాలి.అంటే మీరు హైదరాబాద్ నుండి తిరుపతి, బెంగళూరు, చెన్నైకి వెళ్లాలనుకుంటే, తిరుపతి, బెంగళూరు, చెన్నైలో బ్రేక్ జర్నీలతో హైదరాబాద్లో ప్రారంభమై హైదరాబాద్లో ముగిసే సర్క్యులర్ జర్నీ టికెట్ బుక్ చేసుకోవచ్చు.సీనియర్ సిటిజన్లు కనీసం 1,000 కి.మీ దూరం ప్రయాణించినట్లయితే, సర్క్యులర్ జర్నీ టికెట్ ఛార్జీలో పురుషులకు 40%, మహిళలకు 50% తగ్గింపు లభిస్తుంది.







