ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలోని తూర్పు కనుమలు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందాయి.ఇక్కడ దట్టమైన అడవులు, కనువిందు చేసే సెలయేళ్లు ఉన్నాయి.
ఇంకా ఇవి ప్రకృతి సౌందర్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాయి.తూర్పు కనుమలకు సమీపంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా మారేడుమిల్లి, లంబసింగి, వంజంగి, అరకు, మాడగడ వంటి అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు నిలయంగా నిలుస్తోంది.
అయితే ఈ ప్రాంతాలకు పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు జిల్లాలో కారవాన్ టూరిజంను ప్రవేశపెట్టాలని ఏపీ పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది.
కారవాన్ టూరిజం( Caravan tourism ) ఇతర దేశాలలో పాపులర్ అయిన టూరిజం ఆప్షన్గా ఉంది.
ఇది భారతదేశంలో కూడా ప్రజాదరణ పొందుతోంది.పర్యాటకులు ఒకే వాహనంలో ప్రయాణించడానికి, వంట చేసుకోవడానికి, కలిసి ఉండటానికి అనుమతిస్తుంది.
కారవాన్లలో పడకగది, వంటగది, మంచినీటి వనరులతో సహా అవసరమైన అన్ని సౌకర్యాలు ఉంటాయి.

విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, గండికోట, అరకు సహా రాష్ట్రంలోని 15 చోట్ల కారవాన్ టూరిజంను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని పర్యాటక శాఖ భావిస్తోంది.విశాఖపట్నంలో మూడు వేర్వేరు టూరిజం స్పాట్లలో పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అంజోడ ఫారెస్ట్, దల్లాపల్లి హిల్స్టేషన్లో కూడా కారవాన్ టూరిజం ఏర్పాటు చేయాలని టూరిజం డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తోంది.

తూర్పు కనుమలలో కారవాన్ టూరిజం ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటకం వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.ఇది పర్యాటకులకు ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యాన్ని అనుభూతి చెందడానికి ప్రత్యేకమైన, మరపురాని మార్గాన్ని అందిస్తుంది.ఇది స్థానిక వ్యాపారాలకు అవకాశాలను అందించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి కూడా సహాయపడుతుంది.







