కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడ్డారు.తెలంగాణ ప్రజలను హస్తం పార్టీ మోసం చేస్తుందంటూ ధ్వజమెత్తారు.
అప్పుడు ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ కానీ ఇప్పుడు వయా బెంగళూరు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అని దుయ్యబట్టారు.
ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడమే కాంగ్రెస్ నేతల నైజం అంటూ తీవ్రంగా మండిపడ్డారు.తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుగా మారిందంటూ నిప్పులు చెరిగారు.
ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.