ముంబై వేదికగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇవాళ ముంబై వేదికగా విపక్షాల ఇండియా కూటమి మూడో సమావేశం జరగనుంది.

 Key Developments In Maharashtra Politics From Mumbai-TeluguStop.com

మరోవైపు బీజేపీ సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు కీలక సమావేశాలను నిర్వహిస్తుంది.దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది.2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విపక్షాల ఇండియా కూటమి, అటు బీజేపీ వ్యూహా ప్రతివ్యూహాలు రచిస్తుండటం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు.అయితే ఉమ్మడి పోరుకు పదును పెట్టనున్న విపక్ష పార్టీలు రెండు రోజులపాటు భేటీలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే లోగోతో పాటు పదకొండు మందితో సమన్వయ కమిటీని ఖరారు చేసే అవకాశం కూడా ఉంది.కాగా ఈ సమావేశాలకు 28 పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.

అదేవిధంగా కూటమికి సమన్వయకర్తను ఎన్నుకునే ఛాన్స్ కూడా ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube