నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం చెలరేగింది.విశ్వనాథ్ పేట్ -బంగల్ పెట్ మార్గంలో చిరుత సంచరిస్తుండగా స్థానికులు గుర్తించారు.
చిరుత పులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన ఫారెస్ట్ ఆఫీసర్స్ పులి సంచరించిన ప్రాంతాలను సందర్శించి పాదముద్రలను గుర్తించారు.చిరుతపులి సంచారం తో సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.