మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం జిల్లాలోని నాయకన్ గూడెంకు చేరుకున్నారు.ఈ క్రమంలో అభిమానులు, మద్ధతుదారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
నాయకన్ గూడెం నుంచి వెయ్యి కార్లతో శ్రీ సిటీ వరకు అభిమానుల భారీ ర్యాలీ కొనసాగనుంది.తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
పాలేరు నియోజకవర్గ సీటును ఆశించిన తుమ్మలకు నిరాశ ఎదురైంది.ఈ క్రమంలో ఆయనను కాదని ఉపేందర్ రెడ్డికి పార్టీ అధిష్టానం సీటును కేటాయించింది.
దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తుమ్మల ఇవాళ హైదరాబాద్ నుంచి ఖమ్మంకు వస్తున్న విషయం తెలిసిందే.కాగా తుమ్మల తన రాజకీయ భవిష్యత్ పై ఏ నిర్ణయం తీసుకోనున్నారన్న అంశం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.