తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ గజ్వేల్ మరియు కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు.ఈ నేపథ్యంలో కేసీఆర్ కు ధీటుగా కీలక నేతలను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది.
గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ చేయనుండగా కామారెడ్డిలో రాములమ్మ బరిలో దిగనున్నారని తెలుస్తోంది.కేసీఆర్ పై బీజేపీ కీలక నేతల పోటీతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు మధ్య అవగాహన ఉందనే ప్రచారానికి తెర పడే అవకాశం ఉందని తెలుస్తోంది.