తెలంగాణ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఇవాళ జరగనుంది.ఇందులో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఆయన నివాసానికి భారీగా చేరుకున్నారు.తమ అభిమాన నేతకు మంత్రి పదవి రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టపాసులు పేలుస్తూ సంబరాలు నిర్వహించడంతో మహేందర్ రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది.కాగా మంత్రివర్గంలో ఈటల రాజేందర్ స్థానం ఖాళీ అవడంతో పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం వచ్చిందని తెలుస్తోంది.