మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు టెండర్స్ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ న్యాయస్థానంలో పలు పిటిషన్ లు దాఖలు అయ్యాయి.
కులాలకు మద్యం దుకాణాల రిజర్వేషన్ సరికాదని పిటిషన్ లో పేర్కొన్నారు.అందరికీ సమాన అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు వాదనలు వినిపించారు.
పిటిషనర్స్ అప్లికేషన్స్ పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది.అదేవిధంగా తదుపరి తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాలని ఎక్సైజ్ శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే అప్పటివరకు నోటిఫికేషన్ పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం పది రోజులకు వాయిదా వేసింది.







