రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగ బీభత్సం సృష్టించాడని తెలుస్తోంది.వేములవాడలో ఓ ఇంటికి వెళ్లిన దుండగుడు ముందుగా ఇంటి డోర్ కొట్టాడు.
దీంతో మహిళ బయటకు రాగా ఆమె మెడలోంచి బంగారు చైన్ లాక్కెళ్లాడని తెలుస్తోంది.
ఈ క్రమంలో సుమారు మూడు తులాల బంగారం గొలుసును అపహరించుకుని వెళ్లాడని బాధితురాలు వాపోయారు.
చోరీకి సంబంధించిన సీసీ పుటేజీలో రికార్డ్ అయ్యాయి.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.







