రైల్వే కోచ్లు, వ్యాగన్ల తయారీకి రెండు దిగ్గజ కంపెనీలు ముందుకు వచ్చాయి.సంయుక్తంగా వీటిని తయారు చేయనున్నాయి.
అల్యూమినియం రోలింగ్, రీసైక్లింగ్లో గ్లోబల్ ఎంటర్ప్రైజ్ సంస్థ అయిన హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇంజినీరింగ్లో నైపుణ్యం కలిగిన సంస్థ టెక్స్మాకో రైల్ ఇంజినీరింగ్ లిమిటెడ్లు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి.సంయుక్తంగా అధిక నాణ్యత గల అల్యూమినియం రైల్ వ్యాగన్లు, కోచ్లను ఉత్పత్తి చేయనున్నాయి.
ఈ కోచ్లు భారతీయ రైల్వేలు ఉద్గార తగ్గింపు లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని హిండాల్కో ఒక ప్రకటనలో తెలిపింది.హిందాల్కో సంస్థ ఇప్పటికే తన ప్రత్యేకమైన అల్యూమినియం మిశ్రమాల ప్రొఫైల్లు, షీట్లు మరియు ప్లేట్లతో పాటు ఫాబ్రికేషన్, వెల్డింగ్ నైపుణ్యంతో ఎందరినో ఆకట్టుకుంది.
టెక్స్మాకో సంస్థ సాంకేతిక నైపుణ్యాన్ని అందించనుంది.డిజైన్, ఫ్యాక్టరీ, ఉత్పత్తి, నైపుణ్యం కలిగిన కార్మికులను అందించనుంది.

సరుకు రవాణాలో 45 శాతం మార్కెట్ వాటాను సాధించే లక్ష్యంతో 2027 నాటికి సరకు రవాణా సామర్థ్యాన్ని 3,000 మిలియన్ టన్నులకు రెట్టింపు చేసే లక్ష్యంతో భారతీయ రైల్వేలు “మిషన్ 3000 MT( Mission 3000 MT )”ని ప్రారంభించింది.ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు రైల్వేశాఖ చురుగ్గా పని చేస్తోంది.వ్యాగన్ డిజైన్ను మెరుగుపరచాలని కోరుతూ, రైల్వే ఆస్తుల మొత్తం సామర్థ్యం మరియు జీవితకాలాన్ని పెంపొందించడానికి వారి స్వంత డిజైన్లను అందించడానికి వ్యాగన్ తయారీదారులను ఆహ్వానించింది.

రైల్వేలలో ఈ పరిణామాలను గుర్తించి హిందాల్కో, టెక్స్మాకో ( Hindalco Industries )తన ప్రత్యేకమైన అల్యూమినియం అల్లాయ్ ప్రొఫైల్లు, షీట్లు మరియు ప్లేట్లతో పాటు ఫాబ్రికేషన్, వెల్డింగ్ నైపుణ్యాన్ని అందించే అవకాశాలను అన్వేషించడానికి చేతులు కలిపాయి.ఈ రెండు కంపెనీలు కలిసి అధిక-నాణ్యతతో కూడిన అల్యూమినియం వ్యాగన్లు, కోచ్లు, పెద్ద పెద్ద కంటైనర్లు, వాటి విడి భాగాలను ఉత్పత్తి చేయనున్నాయి.విదేశీ కంపెనీలపై ఆధారపడకుండా స్వదేశీ సామర్ధ్యంతోనే వీటిని తయారు చేసేందుకు కేంద్రం నడుం బిగించింది.
అంతేకాకుండా సరుకు రవాణా సుంకాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ద్వారా రవాణాను మెరుగుపర్చనుంది.







