హకీంపేట ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేశామని పేర్కొన్నారు.
మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ క్రమంలో రెండు లేదా మూడు రోజుల్లో విచారణ పూర్తి చేసి ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
నిందితులకు సహకరించిన వారిని కూడా వదిలిపెట్టమని స్పష్టం చేశారు.విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకే తక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఘటనపై తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు నిజమని తేలితే జైలుకు పంపిస్తామని వెల్లడించారు.







