ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
ఇందులో భాగంగా రేపు, ఎల్లుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు.ఈ మేరకు రేపు, ఎల్లుండి ఏలూరు, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో జగన్ పర్యటించనున్నారు.







