జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్రకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈనెల 10 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వారాహి యాత్రను నిర్వహించనున్నారు పవన్.
మొత్తం నగర పరిధిలో జరగనున్న ఈ వారాహి యాత్రలో భాగంగా మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నారు.ఈ మేరకు దసపల్లా, ముదపాక, విస్సన్నపేటలో సభల కోసం పార్టీ నేతలు స్థలాలను పరిశీలిస్తున్నారు.
అదేవిధంగా యాత్రలో భాగంగానే రుషికొండను పవన్ కల్యాణ్ సందర్శించనున్నారు.ఇటీవల వాలంటీర్ చేతిలో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.







