తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అక్కినేని నాగచైతన్య( Nagachaitanya ) వరస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు.తన తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన మంచి హిట్ అందుకున్నారు.
ఈ సినిమా తర్వాత థాంక్యూ( Thank You ) , కస్టడీ(Custody) వంటి సినిమాలలో నటించిన అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.అయితే ఈయన తన తదుపరి చిత్రాన్ని కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి( Chandu Mondeti ) దర్శకత్వంలో చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమా కోసం నాగచైతన్య భారీగానే కష్టపడుతున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాలో నాగచైతన్య ఒక జాలరి పాత్రలో కనిపించబోతున్నారట.అయితే ఈ సినిమా కోసం చైతన్య తనును తాను మెరుగుపరుచుకోవడం కోసం శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈయన పాండిచ్చేరికి ( Pondicherry ) వెళ్ళినట్టు తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ చూస్తే అర్థమవుతుంది.
నాగచైతన్య పాండిచ్చేరిలోని ఆదిశక్తి థియేటర్ (Adishakthi theatre ) వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ రెండు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.పాండిచ్చేరిలో చేసిన తన ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలియజేశారు.
దీంతో నాగచైతన్య పాండిచ్చేరికి ఎందుకు వెళ్లారు అంటూ అందరూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
పాండిచ్చేరిలోని ఆదిశక్తి థియేటర్ నటనకు శిక్షణ ఇవ్వడంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచింది.ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతున్న వారు కూడా కొత్త తరహా పాత్రలలో చేయడానికి లేదా నటనను మెరుగుపరుచుకోవడం కోసం శిక్షణ పొందటానికి పెద్ద ఎత్తున ఆదిశక్తి థియేటర్ కు వెళ్తారు.ఈ క్రమంలోనే నాగచైతన్య కూడా ఆదిశక్తి థియేటర్ కి వెళ్లి నటనలో మరిన్ని మెలకువలు నేర్చుకున్నట్టు తెలుస్తుంది.
అయితే ఈయన ఇంతలా కష్టపడుతున్నది మాత్రం డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో రాబోయే సినిమా కోసమేనని స్పష్టంగా తెలుస్తోంది.ప్రస్తుతం నాగచైతన్య షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.