వరంగల్ పర్యటనలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.లంబాడీల విషయంపై ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తెలిపారు.
ఈ క్రమంలోనే ఆ కామెంట్స్ కు పార్టీకి సంబంధం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్టీ రిజర్వేషన్లను పెంచే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.
అవసరం అయితే ముందే పెంచుతామన్నారు.పార్లమెంట్ ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ద్వారా రిజర్వేషన్లు పెంచవచ్చన్న కిషన్ రెడ్డి జనాభా ప్రతిపాదికన రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా చేయవచ్చని తెలిపారు.







