తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu Film Industry )లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి.ఒకే కథతో ఎన్నో సినిమాలు వచ్చిన వాటి స్క్రీన్ ప్లే మారడంతో మనం వాటిని గుర్తించడం జరగదు.
కానీ కొన్ని అచ్చుగుద్దినట్టుగా ఒకే రకమైన స్క్రీన్ ప్లేతో వచ్చినా కూడా వాటిని గుర్తించడం చాలా కష్టం అవుతుంది.అలా ఇండస్ట్రీలో కథల కొరత ఉండటం వల్ల ఒకే కథ చుట్టూ రకరకాల పాత్రలు అల్లి మరో కొత్త కథల చూపించడానికి దర్శకులు ప్రయత్నిస్తూ ఉంటారు అలా ఎంత చేసినా ఒక్కోసారి దొరికిపోతుంటారు అలాంటి ఒక అద్భుతమైన కాంబినేషన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెండు సినిమాల్లో ఉంటుంది.అవే మన్మధుడు మరియు వివాహ భోజనంబు.
వివాహ భోజనంబు( Vivahabhojnambu )

ఈ సినిమా ఒక కామెడీ కోణంలో దర్శకుడు జంధ్యాల 1988లో తీశారు.కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్( Rajendra Prasad ) హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్దగా విజయమైతే సాధించలేదు కానీ దాదాపుగా ఆడవాళ్ళని ద్వేషించే పాత్రలో రాజేంద్రప్రసాద్ పాత్ర ఉంటుంది.ఈ సినిమా అప్పట్లో యావరేజ్ గా నడిచింది.తమిళ నటి అశ్విని హీరోయిన్ గా నటించింది.
మన్మధుడు( Manmadhudu )

త్రివిక్రమ్ రాసిన కథతో దర్శకుడు కె విజయభాస్కర్ తీసిన ఈ సినిమా అతిపెద్ద విజయం సాధించింది నాగార్జున( Nagarjuna ), అషు, సోనాలి బింద్రే హీరో హీరోయిన్స్ గా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో కలెక్షన్స్ పరంగా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో ఆడవారిని ద్వేషిస్తూ ఉండే హీరో పాత్రలో నాగార్జున చాలా చక్కగా నటించారు.మ్యూజికల్ గా కూడా ఈ సినిమా చాలా బాగుంటుంది అందుకే ఈ సినిమా ఇప్పటికీ నాగార్జున కెరీర్ లో ఆల్ టైం ఫేవరెట్ మూవీ గా ఉండిపోయింది.
ఇలా ఒక్కేది కథతో వచ్చిన ఈ రెండు సినిమాల గురించి ఇప్పటి తరం ప్రేక్షకులకు కచ్చితంగా తెలిసే అవకాశం లేదు ఇలా ఎన్నో సినిమాలు ఒకే ప్లాట్ తో వచ్చి జనాల ముందు బాగా ఆడతాయి కూడా







