విజయవాడలో కొండచరియలు విరిగిపడుతున్నాయి.కస్తూరిబాయిపేటలో కొండ చరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో సుమారు నాలుగు ఇళ్లు ధ్వంసం అయ్యాయి.
ఈ ఘటనలో పలువురు మహిళలకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.ఇటీవల గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే విజయవాడలోని కొండ చరియలు విరిగి పడుతున్నట్లు తెలుస్తోంది.







