కోనసీమ జిల్లా అధికార పార్టీ వైసీపీలో రాజకీయ వేడి రాజుకుంది.ఇవాళ రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సమావేశం నిర్వహించారని ఆయన అనుచరులు తెలిపారు.అయితే గత ఆదివారం మాజీ మంత్రి పిల్లి సుభాష చంద్రబోస్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన సమావేశానికి కౌంటర్ గానే మంత్రి చెల్లుబోయిన ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది.