తెలంగాణ ఏర్పడినా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదని మాజీ ఎంపీ పొంగులేటి సత్యనారాయణ అన్నారు.కేసీఆర్ కు స్కీంలు లాంచ్ తప్ప అమలు తెలియదని పేర్కొన్నారు.
ఉచిత కరెంటును వాళ్లే కనుగొన్నట్లు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారని తెలిపారు.కేసీఆర్ దొంగ నిరాహార దీక్షలతో తెలంగాణ రాలేదని చెప్పారు.
ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.తెలంగాణకు అప్పు, కేసీఆర్ కుటుంబానికి డబ్బు మిగిలిందని మండిపడ్డారు.
ఆచరణకు సాధ్యమయ్యే హామీలను కాంగ్రెస్ ఇస్తుందని స్పష్టం చేశారు.కేసీఆర్ దోచుకున్న ప్రతీ పైసాను వడ్డీతో సహా కక్కిస్తామని వెల్లడించారు.
బీఆర్ఎస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.