హైదరాబాద్ నగరంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి.నిత్యం ఏదో ఒక క్రైమ్ ఈ నగరంలో జరుగుతూనే ఉంటుంది.
ఒకపక్క అభివృద్ధి జరుగుతున్న గాని మరోపక్క అసాంఘిక కార్యకలాపాలకు.హైదరాబాద్ గురవుతోంది.
డ్రగ్స్.రకరకాల క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి.
దేశంలోనే పేరుగాంచిన నగరం కావటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు సైతం.ఉద్యోగాలు చేస్తున్న క్రమంలో దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి.
తాజాగా కేరళకు( Kerala ) చెందిన దొంగలు జులై మూడవ తారీకు హిమాయత్ నగర్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( Punjab National Bank )ఎటిఎంలో చోరీ చేసి ఏడు లక్షల దోచుకున్నారు.

ఏటీఎంలో( ATM ) ఉన్న బాధితుడిపై దాడి చేసి మొహం పై పెప్పర్ స్ప్రే కొట్టి దొంగతనానికి పాల్పడటం జరిగింది.ఈ దొంగతనానికి సంబంధించిన ఘటన పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయింది.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేడు ఆ కేరళ దొంగలని పట్టుకోవడం జరిగింది.
మొత్తం ఈ దొంగతనానికి నలుగురు పాల్పడటంతో పాటు కారుని కూడా సీజ్ చేయడం జరిగింది.







