బాహుబలి సినిమా( Baahubali ) తర్వాత ప్రభాస్ నుండి సాహో.రాధేశ్యామ్.
ఆదిపురుష్ సినిమా లు వచ్చిన విషయం తెల్సిందే.హీరోగా ప్రభాస్ కి సరైన కాలం కలిసి రావడం లేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో ప్రభాస్ నుండి రాబోతున్న సలార్ సినిమా ను రెండు భాగాలు గా విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రకటించాడు.అంతే కాకుండా సినిమా నుండి వచ్చిన టీజర్ సినిమా స్థాయిని అమాంతం పెంచింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సలార్( Salaar ) టీజర్ కు వారి నుండి వచ్చిన స్పందన అద్భుతం అనుకోవచ్చు.అలాంటి అద్భుతమైన సలార్ ను రెండు భాగాలుగా విడుదల చేస్తే కచ్చితంగా డబుల్ ధమాకా ఖాయం.వసూళ్లు కూడా డబుల్ రావడం ఖాయం.రెండు పార్ట్ లు కూడా వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తాయి అంటూ వార్తలు వస్తున్నాయి.మరో వైపు ప్రాజెక్ట్ కే సినిమా ను కూడా రెండు భాగా లుగా విడుదల చేయాలని భావిస్తున్నారు.
సాహో.రాధేశ్యామ్.
ఆదిపురుష్ సినిమా లు సింగిల్ పార్ట్ లుగానే వచ్చాయి.కనుక ఈ సినిమా లు డబుల్ పార్ట్ లు గా రాబోతున్నాయి కనుక భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఇప్పటికే ప్రాజెక్ట్ కే( Project K ) ను ఒక టైమ్ ట్రావెల్ కథ తో రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.రాధేశ్యామ్ సినిమా ఆహా ఓహో అంటూ ప్రచారం చేసినా కూడా నిరాశ మిగిల్చింది.ఇక ఆదిపురుష్ సినిమా గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అన్నట్లుగా ప్రచారం చేశారు.తీరా చూస్తే బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.అందుకే రెండు పార్ట్ ల సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయి బాహుబలి మాదిరిగా ప్రాజెక్ట్ కే మరియు సలార్ ల్లో ఏదో ఒకటి సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.







