అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.జేసీకి వ్యవసాయం తెలియదని చెప్పారు.2024లో జేసీ కుటుంబానికి రాజకీయ సమాధి కట్టి చూపిస్తానని సవాల్ చేశారు.2024 ఎన్నికల తరువాత ఎవరు పాడెక్కుతారో చూద్దామని అంటూ వ్యాఖ్యానించారు.జగన్ కాళ్లు పట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ అడిగితే జేసీ కుమారుడికి తానే వైసీపీ టికెట్ ఇప్పించి గెలిపిస్తానని తెలిపారు.
అవినీతి జరిగితే నిరూపించాలని సూచించారు.