ఆరిజెన్ డెయిరీ సీఈవో శేజల్ మరోసారి తన ఆవేదన వ్యక్తం చేశారు.మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అయితే తనను లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పారన్నారు.కానీ లోకల్ పీఎస్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
ఇప్పటివరకు ఎమ్మెల్యే చిన్నయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు.తనకు ఎప్పుడు న్యాయం జరుగుతుందోనని సెల్ఫీ వీడియోలో శేజల్ ఆవేదన వ్యక్తం చేశారు.







