పరువు తీశారు కదరా నీచుల్లారా... సంచలన ట్వీట్ చేసిన బండ్ల గణేష్?

సినీ నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బండ్ల గణేష్ ( Bandla Ganesh ) ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయకపోయినా సినిమాలకు సంబంధించిన అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఇక ఈయన సోషల్ మీడియా వేదికగా లేదా ఏదైనా కార్యక్రమాలలో పాల్గొన్న సమయంలో తను మాట్లాడే మాటలు పెద్ద ఎత్తున వివాదంగా మారుతూ ఉంటాయి.

 Kadara Nichullara Defamed, Bandla Ganesh,balakrishna, Tana ,twitter As A Platfor-TeluguStop.com

అయితే తాజాగా బండ్ల గణేష్ అమెరికాలో జరుగుతున్నటువంటి తానా( TANA ) కార్యక్రమంలో భాగంగా చోటు చేసుకున్నటువంటి గొడవ గురించి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఎన్నారైలపై విమర్శలు చేశారు.

అమెరికా వేదికగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ( TANA ) వేడుకలు జరుగుతున్నాయి.ఈ వేడుకలకు బాలకృష్ణ( Balakrishna ), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా  హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో దాడి చేసుకున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ఈ వీడియోలపై నిర్మాత బండ్ల గణేష్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…తానా పరువు తీస్తున్నారు కదా.దానిని నిర్మించడానికి ఎంతో మంది మన జాతి పెద్దలు పడ్డ కష్టాన్ని గంగలో కలిపారు నీచుల్లారా అంటూ ఈయన అసహనం వ్యక్తం చేస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ బాలయ్య అభిమానుల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో ఇద్దరు హీరోలు అభిమానులు రెండు గ్రూపులుగా ఏర్పడి గొడవ పడ్డారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube