చిత్తూరు జిల్లా కుప్పంలో బ్యానర్ల రగడ

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో బ్యానర్ల చిచ్చు రాజుకుంది.అధికార పార్టీ వైసీపీ, విపక్ష పార్టీ టీడీపీ మధ్య బ్యానర్ల వివాదం నెలకొంది.

 Chittoor District Kuppam Banner Waving-TeluguStop.com

వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని బెంగళూరు నుంచి కుప్పం వరకు వైసీపీ ఐటీ మరియు సోషల్ మీడియా విభాగం 175 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.జగనన్న ప్రగతి పథం పేరిట వైసీపీ ర్యాలీ కొనసాగింది.

అయితే వైసీపీ శ్రేణులకు స్వాగతం అంటూ టీడీపీ వినూత్న రీతిలో బ్యానర్లను ఏర్పాటు చేశారు.చంద్రబాబు హయాంలో జరిగిన సమగ్ర అభివృద్ధిని చూడండంటూ ఫొటోలతో పలు చోట్ల బ్యానర్లు ఏర్పాటు చేశారు.

మరోవైపు టీడీపీ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడమే కాకుండా దగ్ధం చేశారు.దీంతో కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube