రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండా గ్రామానికి చెందిన గుగులోత్ అనిల్ భార్య మేరీ 28 చిన్న కుమారుడు శివాన్స్ తో కలిసి పుట్టినిల్లు అయిన గుండారం గ్రామానికి వెళ్తానంటే శనివారం ఎల్లారెడ్డిపేట బస్టాండుకు బైక్ పై వచ్చి కామారెడ్డి బస్సు ఎక్కించానని తరువాత భార్య సెల్ ఫోన్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చిన భర్త
మామకు ఫోన్ చేయగా తన ఇంటికి రాలేదని తెలపడంతో ఇరుగు పొరుగు వారికి ఫోన్ చేసి మేరీ గురించి ఆరా తీయగా మేరీ రాలేదని చెప్పడంతో భార్య కుమారుడు కనబడుటలేదని ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేశారు.ఎస్సై ప్రేమ్ దీప్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.







