తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసే ఉన్నాయన్నారు.
బీజేపీతో కూటమి కట్టేందుకు ఢిల్లీలో కేటీఆర్ చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు.ప్రతి పక్షాల భేటీ రోజే బీజేపీ మంత్రులను కేటీఆర్ కలవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందన్న ఆయన ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు.త్వరలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరతారని వెల్లడించారు.







