చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యాక ఎట్టకేలకు రిలీజ్ అయిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’( Adipurush ).కృతి సనన్ ( Kriti Sanon )హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్( Om Raut ) తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీని ‘టి సిరీస్ ఫిలిమ్స్’ ‘రిట్రోఫిల్స్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.
సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ జూన్ 16 న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదలయ్యింది…అయితే ఈ సినిమా కి రిలీజ్ రోజు నుంచే మిక్సెడ్ టాక్ రావడం తో ఈ సినిమా కలెక్షన్స్ మొడతీడు రోజుల తరువాత చాలా వరకు తగ్గినట్టుగా తెలుస్తుంది.

ఇక హిందీలో ప్రభాస్ నటించిన స్ట్రైట్ మూవీ ఇదే కావడం విశేషం.మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా ఓపెనింగ్స్ మాత్రం చాలా బాగా నమోదయ్యాయి.ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేసింది.
కానీ సోమవారం నుండీ డ్రాప్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఒకసారి 7 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తేఆదిపురుష్’ చిత్రానికి రూ.229.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.230 కోట్ల షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినప్పటికీ 7 రోజులు పూర్తయ్యేసరికి రూ.200.80 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి మరో రూ.30 కోట్ల షేర్ ను రాబట్టాలి.