ఏపీ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.వైసీపీ ప్రభుత్వం ఉండేది ఆరు నెలలేనన్న ఆయన ఎవరినీ వదలను అని హెచ్చరించారు.
తాను అధికారంలో ఉంటే హంద్రీ-నీవా పూర్తి అయ్యేదని చంద్రబాబు తెలిపారు.టీడీపీ మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేస్తామని పేర్కొన్నారు.
సంపద సృష్టించి పేదలకు పంచుతామన్నారు.దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పంను అభివృద్ధి చేస్తానని చెప్పారు.
రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వారు టీడీపీకి మద్దతు పలకాలని సూచించారు.







