ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల నుండి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు అంటూ రైల్వే స్టేషన్, బస్టాండ్ లలో అధికారులు హెచ్చరించడం చాలాసార్లు అందరూ వినే ఉంటారు.ఎందుకంటే దొంగతనం, కిడ్నాప్, అత్యాచారం, హత్య లాంటివి చేయడం కోసం అపరిచిత వ్యక్తులు ఆహార పదార్థాలలో మత్తు పదార్థాలు పెట్టి తమ పనులను సులువుగా కానిచ్చేస్తారు.
అయితే ప్రభుత్వ అధికారులు ఎంత హెచ్చరించినా అమాయకులు అపరిచిత వ్యక్తుల చేతులలో దారుణంగా మోసపోతూనే ఉన్నారు.ఇలాంటి కోవలోనే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో గురువారం జరిగిన కిడ్నాప్ కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది.
అసలు కిడ్నాప్ ఎలా జరిగిందో చూద్దాం.
వివరాల్లోకెళితే.ఓ నిండు గర్భిణి తన ఏడాదిన్నర కొడుకుతో కలిసి యాదాద్రి జిల్లా( Yadadri Bhuvanagiri ) నుండి రైలులో విశాఖపట్నానికి వచ్చింది.తమ పక్కనే ఉన్న ఒడిశాకు చెందిన దంపతులు ఆమె ఏడాదిన్నర కొడుకును కిడ్నాప్ చేసి అపహరించారని ఆమె పోలీసులకు( police ) ఫిర్యాదు చేసింది.
పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి సీసీటీవీ ల ఆధారంగా నిందితులను గాలిస్తున్నారు.
పూర్తిగా వివరాలలోకి వెళితే.
బాధిత గర్భిణిది తెలంగాణలోని భువనగిరి జిల్లా.ఈమె తన భర్త వేధింపులు తట్టుకోలేక తన కుమారుడితో పాటు రైలులో విశాఖపట్నం( Visakhapatnam ) వచ్చింది.
విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్లాట్ నెంబర్ 8 వద్ద కూర్చొని ఉండగా.ఓ జంట వచ్చి ఈమెతో కాసేపు మాట్లాడారు.
కాసేపటి తర్వాత ఆ దంపతులు టీ ఇచ్చారు.టీ తాగిన గర్భిణీ స్త్రీ కాసేపటికి నిద్రలోకి జారుకుంది.
ఆమెకు మేలుకువ వచ్చి చూసుకునేసరికి తన ఏడాదిన్నర కొడుకు కనిపించలేదు.ఆ దంపతులు కూడా కనిపించకపోవడంతో వారే తన కొడుకును కిడ్నాప్ చేసి ఉంటారని రైల్వే స్టేషన్లో ఉండే మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ దంపతులు ఒడియాలో మాట్లాడేవారని పోలీసులకు తెలిపింది.పోలీసులు రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ఆ తర్వాత నగరంలోని సీసీటీవీ కెమెరా లను పరిశీలించి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆ గర్భిణీ స్త్రీకి హామీ ఇచ్చారు.