రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో దారుణం జరిగింది.ప్రియురాలిని హత్య చేసి మృతదేహాన్ని సరూర్ నగర్ మ్యాన్ హోల్ లో దాచిపెట్టాడు ఓ ప్రియుడు.
ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.కాగా ప్రియురాలిపై తలపై రాయితో కొట్టి హత్య చేసిన నిందితుడు ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో భాగంగా ప్రియుడే హత్య చేసినట్లు గుర్తించారు.పెళ్లి చేసుకోమని మహిళ ఒత్తిడి చేయడంతో హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
కాగా మహిళకు ఇదివరకే వివాహం అయి ఇద్దరు పిల్లలున్నారని సమాచారం.నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
మృతురాలితో ప్రియుడు పూజారికి వివాహేతర సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు.







