మహిళ రెజ్లర్లకు న్యాయం చేయాలని సీఐటీయూ రాస్తరోకో...!

సూర్యాపేట జిల్లా:భారత కీర్తి ప్రతిష్టలను పెంచి, ప్రపంచ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించిన మహిళ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్( ij Bhushan Sharan Singh ) ను వెంటనే అరెస్టు చేసి విచారణ జరపాలని కోరుతూ బుధవారం సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

 Citu Writes To Give Justice To Women Wrestlers...!-TeluguStop.com

మనువాద ధర్మాన్ని పాటిస్తున్న మోదీ,బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో మహిళలకు కనీస హక్కులు లేవన్నారు.పసి పిల్లలను వదలకుండా అత్యాచారాలు,హత్యలు చేస్తున్నారని,అందులో భాగంగానే భారత కుస్తీ పోటీల్లో పాల్గొని దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన రెజ్లర్ల కు బీజేపీ( BJP ) ఎంపీ భ్రుజ్ భూషణ్ చరణ్ సింగ్ శారీరకంగా,మానసికంగా లొంగదీసుకోని,కాదన్న వారిని వేధించడం మొదలు పెట్టిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పట్టించుకోక పోవడం,పైగా ఎంపినీ కాపాడే ప్రయత్నం చేయడం మనువాద పోకడ తప్ప మరొకటి కాదన్నారు.

మొదట్లో తప్పు చేయలేదని కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ప్లేట్ ఫిరాయించడం జరిగిందన్నారు.నెలల తరబడి ఢిల్లీ( Delhi ) నగరంలో దీక్షలు చేస్తున్న మహిళ రేజ్లర్లను బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం దుర్మార్గమన్నారు.

రోజుకోక మాట పూటకొక మాట మాట్లాడుతూ తప్పించుకొని తిరుగుతున్న బీజేపీ ఎంపీని తక్షణమే అరెస్ట్ చేయాలని,మహిళ రేజ్లర్లకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.రాంబాబు,శీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube