”VNRTrio”.అనౌన్స్ మెంట్ వీడియో తోనే రచ్చ రచ్చ చేసిన ఈ కాంబో అంచనాలు బాగా క్రియేట్ చేసుకుంది.
ఆ తర్వాత కొద్దీ గ్యాప్ తోనే మెగాస్టార్ చేతుల మీదుగా గ్రాండ్ లాంచ్ చేసుకున్న ఈ సినిమా షూట్ జరుపుకునేందుకు సిద్ధంగా ఉంది.డైరెక్టర్ వెంకీ కుడుముల( Venky Kudumula ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నితిన్ హీరోగా నటిస్తున్నారు.
ఇది భీష్మ కాంబో అని తెలిసిందే.వెంకీ కుడుముల ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో రష్మిక మందన్న( Rashmika Mandanna ) నే హీరోయిన్ గా నటించింది.
ఇక ఇప్పుడు ముచ్చటగా మూడవసారి కూడా ఈ భామనే ఎంపిక చేసుకున్నాడు.ఛలో, భీష్మ సినిమాలతో వరుసగా రెండు హిట్స్ అందుకుని ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వెంకీ ఇప్పుడు మూడవ సినిమాను మరింత కసిగా తెరకెక్కిస్తున్నాడు.

మూడేళ్ళ పాటు గ్యాప్ తర్వాత వెంకీ మళ్ళీ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి.ఇక తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ బయటకు రాగ నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సినిమాలో కృతి శెట్టి( Krithi Shetty ) కూడా నటించనుంది అని టాక్ వస్తుంది.మరి కృతి శెట్టి ఎలాంటి రోల్ లో కనిపిస్తుందో వేచి చూడాలి.

ఇదిలా ఉండగా కథ విషయానికి వస్తే ఒక నెలలో చనిపోతాను అని తెలుసుకున్న ఒక వ్యక్తి తన జర్నీని ఎంత హ్యాపీగా మార్చుకున్నాడు ? ఎలాంటి సంఘటనలు ఎదుర్కున్నాడు అనే దానిపై వెంకీ ఈ సినిమాను ఫన్నీగా తెరకెక్కించ బోతున్నాడు.ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండ గా.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.చూడాలి ఈ కాంబో ఈసారి ఎలా ఉంటుందో.







