రాజమండ్రి వేదికగా టీడీపీ నిర్వహించనున్న మహానాడుకు సర్వం సిద్ధం అయింది.రేపటి నుంచి రెండు రోజులపాటు మహానాడును నిర్వహించనున్నారు.
ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ప్లీనరీ, బహిరంగ సభలకు వేరు వేరుగా ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు.
రేపు ప్రతినిధుల సభ జరగనుండగా ఈ నెల 28న మహానాడు బహిరంగ సభ జరగనుందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇవాళ రాజమండ్రిలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా మహానాడు అజెండాను ఖరారు చేయనున్నారు.