తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని తెలుస్తోంది.ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం అయ్యాయి.
ఇందులో భాగంగా జూన్ 2 వ తేదీ నుంచి సుమారు 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.ఈ ఉత్సవాల నిర్వహణ కోసం కలెక్టర్లకు రూ.105 కోట్ల నిధులను సైతం విడుదల చేసింది.అటు కేంద్ర ప్రభుత్వం వేడులకను పురస్కరించుకుని పారా మిలటరీ బలగాలతో పరేడ్ నిర్వహించనున్నట్లు తెలిపింది.
మరోవైపు కాంగ్రెస్ సైతం వేడుకలను జరిపేందుకు సిద్ధమైంది.ఈ మేరకు హైదరాబాద్ గాంధీభవన్ లో కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ భేటీ కానుంది.
వేడుకలను ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్వహించాలనే విషయంపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు.