కె.జి.ఎఫ్ 1, 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ప్రస్తుతం సలార్ అంటూ ప్రభాస్ తో మరో సంచలనానికి సిద్ధం అవుతున్నాడు.సలార్ లీక్డ్ ఫోటోలే సినిమాపై క్రేజ్ తెస్తున్నాయి.
సలార్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ పార్ట్ 3 తో పాటుగా ఎన్.టి.ఆర్ 31వ సినిమా కూడా చేస్తాడని తెలిసిందే.2024 మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట.
సినిమా బడ్జెట్ కూడా 300 కోట్ల పైన ఉంటుందని అందులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్.కె.జి.ఎఫ్ సీరీస్ ల తర్వాత ప్రశాంత్ నీల్ డిమాండ్ పెరిగింది.సలార్ సినిమాకు కూడా హోంబలే వారు ప్రశాంత్ నీల్ కి బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ ఇస్తున్నారట.
ఎన్.టి.ఆర్ 31( NTR31 )కి మాత్రం ఈ రెమ్యునరేషన్ లెక్కలు మారాయని తెలుస్తుంది.మొత్తానికి ప్రశాంత్ నీల్ సౌత్ లో స్టార్ డైరెక్టర్ గా రెమ్యునరేషన్ పరంగా కూడా దుమ్ముదులిపేస్తున్నాడని చెప్పొచ్చు.
సలార్ మాత్రమే కాదు ఎన్.టి.ఆర్ సినిమాను కూడా రెండు పార్టులుగా తీస్తారని ఓ టాక్ వినిపిస్తుంది.