ఏపీ సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేశారు.వాలంటీర్ వ్యవస్థ అంటేనే చంద్రబాబుకు కడుపు మంటని విమర్శించారు.
వాలంటీర్ వ్యవస్థ గురించి దుర్మార్గంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ అరాచకాలు ఉండేవని సీఎం జగన్ తెలిపారు.
పేదల ప్రభుత్వంపై గిట్టని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మంచి చేయని వారు కూడా సర్కార్ పై దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు.
ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ వాలంటీర్లేనని జగన్ స్పష్టం చేశారు.