మెగా కోడలు ఉపాసన ( Upasana ) ఏ విషయం గురించి చెప్పినా ఆ విషయం కొన్ని క్షణాల్లో వైరల్ అవుతోంది.ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే.
ఉపాసనకు బుల్లి మెగా పవర్ స్టార్ పుట్టాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.జులై నెలలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్టు వెల్లడించారు.
ఉపాసన కొన్నిరోజుల క్రితం తల్లి కావాలని నేను తీసుకున్న నిర్ణయం వారసత్వాన్ని కొనసాగించాలని లేదా వివాహ బంధాన్ని బలోపేతం చేయాలని తీసుకున్న నిర్ణయం కాదని ఆమె అన్నారు.
నా బిడ్డకు అంతులేని ప్రేమను అందించాలనే కారణంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నానని ఉపాసన చెప్పుకొచ్చారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉపాసన ప్రెగ్నెన్సీకి( Upasana Pregnancy ) సంబంధించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.పెళ్లికి ముందే చరణ్ తో( Ram Charan ) మంచి స్నేహం ఉందని తనతో ఉన్న స్నేహం వల్ల పిల్లలను ఎప్పుడు కనాలనే విషయానికి సంబంధించి స్పష్టత ఉందని ఉపాసన వెల్లడించారు.

చరణ్, నేను పెళ్లి సమయంలోనే నా ఎగ్స్ ను నిల్వ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఉపాసన వెల్లడించారు.ఆ టైమ్ లో కెరీర్ పై దృష్టి పెట్టాలని మేము భావించడం జరిగిందని ఉపాసన పేర్కొన్నారు.జీవితంలో సరైన సంపాదన తర్వాత మాత్రమే పిల్లలకు స్వాగతం చెప్పాలని భావించామని ప్రస్తుతం నేను, చరణ్ స్థిరమైన స్థానాలలో ఉన్నామని ఉపాసన చెప్పుకొచ్చారు.

ఈరోజు మా సంపాదనతో పిల్లలకు మంచి భవిష్యత్తును ఇస్తామనే నమ్మకం ఉందని ఆమె అన్నారు.పెళ్లి ప్రారంభంలోనే తన ఎగ్స్ ను ఫ్రీజ్ చేసినట్టు ఉపాసన చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.ఉపాసన చరణ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చే క్షణం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఉపాసనను అభిమానించే అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం.చరణ్ భార్య ఉపాసనను అభిమానించే అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం.







