తమిళం లో టాప్ హీరో అయిన విశాల్( Vishal ) గురించి పరిచయం చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన తీసిన సినిమాలకి తెలుగు లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.పందెం కోడి సినిమాతో తెలుగు లో మంచి పాపులారిటీ ని సంపాదించుకున్నాడు విశాల్…ఇక తన ప్రతి సినిమాని తెలుగులో విడుదల చేస్తూ ఇక్కడ ప్రజలకు మరింత దగ్గర అయ్యాడు.
మరోవైపు నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అంతే పాపులారిటీ దక్కించుకుంది.మొదట్లో కోలీవుడ్లో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె హీరోయిన్గా ఎక్కువ కాలం కొనసాగలేక.
విలన్ గా అవతారం ఎత్తి తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది.ప్రస్తుతం తెలుగు హీరోలకు లక్కీ లేడీ గా మారిపోయింది వరలక్ష్మి శరత్ కుమార్…
ఇదిలా ఉండగా తాజాగా వరలక్ష్మి శరత్ కుమా( Varalaxmi Sarathkumar )ర్ కు సంబంధించిన ఒక వార్త నెట్టింట చాలా వైరల్ గా మారుతోంది.
ఎంతోమంది హీరోలకు లక్కీ లేడీ గా మారిన ఈమె తన వైవాహిక జీవితానికి మాత్రం ఎందుకు దూరంగా ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.పెళ్లి అన్న మాట వచ్చిన వెంటనే ఆమె దాని నుంచి దాటవేస్తోంది.
అందుకు గల కారణం ఏమిటి అని ఆరా తీయగా.దానికి కారణం కోలీవుడ్ హీరో విశాల్ అని తెలుస్తోంది.
అతడిని చాలాకాలం పాటు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుందట.

అయితే వీళ్ళిద్దరి లవ్ స్టోరీ గురించి కోలీవుడ్ ఇండస్ట్రీలో( Kollywood ) అందరికీ తెలిసిందే.ఇక పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలోనే విశాల్ ఆమె నుంచీ దూరం అయ్యాడు అని తెలుస్తోంది.ఇక అసలు విషయంలోకి వెళితే విశాల్ – వరలక్ష్మీల మధ్య బ్రేకప్ రావడానికి కారణం రెండు రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు.
ఒకటి విశాల్ , వరలక్ష్మీ తండ్రీ శరత్ కుమార్ల మధ్య గొడవలు ఉండడం వల్లే వీరిద్దరూ విడిపోయారని.ఇంకొకపక్క వరలక్ష్మీ శరత్ కుమార్ మొండితనం వల్లే విశాల్ ఆమెను వదిలేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మరొకరేమో ఆమెతో అవసరం తీరిపోయింది.అందుకే వదిలేశాడు అంటూ కూడా విశాల్ పై విమర్శలు గుప్పించారు.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడైతే వీరిద్దరూ విడిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఇద్దరు కూడా ఒకరికొకరు దూరంగా ఉంటూనే సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నారు….
అయితే వరలక్ష్మి కూడా ఇప్పటికే తెలుగులో మంచి సినిమాలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు పొందుతోంది…
.







